Header Banner

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి భారీ షాక్! సీఐడీ కేసు నమోదు!

  Tue Mar 11, 2025 08:00        Politics

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.కాకినాడ పోర్టులో వాటాల బదిలీ వ్యవహారంలో కేవీరావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై 506,384, 420,109,467,120(b)రెడ్ విత్ 34 BNS సెక్షన్లు నమోదు చేశారు.ఈ నెల 12న సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి అధికారులు నోటీజులు జారీ చేశారు. సీఐడీ జారీ చేసిన నోటీసులను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన సీఐడీ విచారణకు హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు కాకినాడ పోర్టులో భారీగా అవకతకలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. సీఐడీతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. పోర్టు రాయించుకుంది విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీనే కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.


ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?


కేసులు చుట్టుముడుతూండటంతోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. విశాఖ బీచ్ విషయంలో ఇప్పటికే ఆయన కూతురిపై కేసు నమోదైంది. దీనికి తోడు కాకినాడ పోర్టు వ్యవహారం మెడకు చుట్టుకోవడంతోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో విజయసాయిరెడ్డి కీలక నేతగా వ్యవహరించారు. వైసీపీ గెలుపోటముల్లో విజయసాయిరెడ్డి జగన్ వెంటే ఉన్నారు. పార్టీలో జగన్ తర్వాత స్థానం ఆయనదే. అలాంటి విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం వైసీపీ శ్రేణులకు బిగ్ షాకిచ్చింది. ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం, పైగా బీజేపీ నుంచి ఒత్తిడి పెరగడంతోనే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారనే ప్రచారం జరిగింది. మొత్తానికి ఆయన తన రాజ్యసభ పదవితో పాటు, పార్టీలోని పదవులకు సైతం రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలో చేరటం లేదని .. భవిష్యత్‌లో వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో తెలిపారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ycp #exmp #casefile #todaynews #bigshock #flashnews #latestnews